వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం నుంచిఅసెంబ్లీ సమావేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకువిపక్షాలు అన్ని సన్నద్దమవుతోన్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకుసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తన నివాసంలో ముఖ్యనేతలతో ఆదివారం చర్చలు జరిపారు.

ఈ సమావేశాల్లో ప్రధానంగా కరువు, విద్యుత్‌, పనికి ఆహార పథకంలో అవినీతి, నదీజలాల సమస్యలు చర్చకు రానున్నాయి. కరువు సమయంలో రైతును ఆదుకోవడంలో ప్రభుత్వంవిఫలమైందని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

అలాగే పనికి ఆహారపథకంలో అవినీతికి పాల్పడ్డ టీడీపీ నేతలలిస్ట్‌ ను కూడా కాంగ్రెస్‌ బయటపెట్టే అవకాశం ఉంది. కొందరు నేతలపై కాంగ్రెస్‌ ఆధారాలుసేకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని కాంగ్రెస్‌ కృతనిశ్చయంగా ఉంది. మరోవైపు, ప్రభుత్వం అభివృద్దినే ప్రధాన ఆయుధంగా సమావేశాలకు సిద్దమౌతోంది.విపక్షాలు ఏ విషయంలో వాదిస్తోయో గ్రహించిన చంద్రబాబువీటిపై కేబినేట్‌ మంత్రులతో చర్చించారు.

ఆదివారం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో ఆయన మంత్రులతో సమావేశమైవిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో చర్చలు జరిపారు. విపక్షాలవిమర్శలను సమర్ధంగా తిప్పికొట్టాలని ఆయన మంత్రులకువివరించారు. ఇక, కృష్ణాజలాల ట్రిబ్యునల్‌ అంశాన్నే ప్రధానఅంశంగా టీఆర్‌ ఎస్‌ ఎంచుకొంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడుతామని టీఆర్‌ ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X