బిచ్చగాళ్ళను నిషేధించనున్న ఎంసిఎచ్?
హైదరాబాద్: రాష్ట్ర రాజధానినిఅందంగా తీర్చడంలో భాగంగా, హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఓవివాదాస్పద నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. రోడ్లపై అడుక్కునే బిచ్చగాళ్ళు న్యూసెన్స్ మారారని భావిస్తోన్న మున్సిపల్అధికారులు దేశ రాజధాని న్యూఢిల్లీ పద్దతిని అనుసరించాలని భావిస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి బిచ్చగాళ్ళను వెలివేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనకు నగర మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడాఓకే చెప్పినట్లు తెలుస్తోంది. స్వచ్చంధ సంస్థలు, రెవిన్యూ, పోలీసు అధికారులతో సమావేశమై ఈవిషయమై ఓ నిర్ణయానికి రావాలని కృష్ణారెడ్డి నిర్ణయించారు. త్వరలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ ఇప్పటికే బిచ్చగాళ్ళను అక్కడి మున్పిపల్ కార్పోరేషన్ నిషేదించింది. ఇటీవల ఆ కార్పోరేషన్ అధికారులు హైదరాబాద్ కువిచ్చేసి నగరాల అభివృద్దికి ఒకర్నొకరు సాయం చేసుకోవాలని నిర్ణయించారు. దాని ఫలితమే ఈ నిర్ణయం.