బీబీ జాగీర్ అరెస్ట్ కు ఆదేశాలు
చంఢీగఢ్: శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ మాజీ అధ్యక్షురాలు బీబీ జాగీర్ కౌర్అరెస్ట్ కు పంజాబ్ లోని ఓ న్యాయస్థానం వారెంట్ లు జారీ చేసింది.విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారంటూ నవంబర్ 8న ఆమెపై కేసు నమోదయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతోన్న బీబీ తనస్వగ్రామం బగోవాలాలో ఉన్న ఇంటి నిమిత్తం విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని ఆరోపణ.
కపూర్తాలా కోర్టు ఆదేశాల మేరకు ఆమెను అరెస్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు ఆ జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.ధోక్ తెలిపారు.
నవంబర్ 12న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెఅరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు, ఎస్ జిపిసి ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ లో భద్రతనుపెంచారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అల్లర్లు జరిగే అవకాశమున్నందునఅకాలీదల్ కు చెందిన 36 మంది కార్యకర్తలను ముందు జాగత్తగా అదుపులోకి తీసుకున్నారు.