వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ లో 3గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో శనివారం రాత్రి నుంచి జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. బద్గాం, అనంతనాగ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలోవీరు మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బద్గాం జిల్లా బద్రాన్ గ్రామంలో టెర్రరిస్ట్ ల ఏరివేతకు శనివారం రాత్రిసైన్యం ప్రవేశించింది.
సైన్యాన్ని చూసి పారిపోతున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పు జరిపినట్లు అధికారులువివరించారు. దీంతో సైన్యం వారిపై ఎదురుకాల్పులు జరపగా, వారు అక్కడికక్కడే మరణించారు. అనంతనాగ్ జిల్లాలోని దండ్వారా అడవుల్లో మరో తీవ్రవాదిని కాల్చివేసినట్లు వారు తెలిపారు.
Comments
Story first published: Sunday, November 10, 2002, 23:53 [IST]