టీఆర్ఎస్ వ్యాఖ్యలపైవిమర్శలు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డాక తొలిసీఎం పదవి దళితుడికే ఇస్తామని తెలంగాణా రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖర్రావు ప్రకటించడం పట్లవిమర్శలు చేలరేగుతున్నాయి. టీఆర్ ఎస్ కూడామిగతా పార్టీల మాదిరిగానే ప్రవర్తిస్తోందని తెలంగాణా మేధావులుపెదవి విరుస్తున్నారు. శనివారం జరిగిన అంబేద్కర్ యువజన సంఘం సదస్సులో చంద్రశేఖర్ రావు దళితసీఎం ప్రస్తావన తీసుకొచ్చారు.
దళితుల ఓట్లను ఆకర్షించేందుకు చేస్తోన్న ప్రయత్నమే తప్ప ఆయన ప్రకటనలో ఇసుమంత కూడా నిజం లేదనిఅంటున్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడుతుందా అనేదిపెద్ద ప్రశ్నార్థకం. ఒకవేళ ఏర్పడినప్పిటికీ,సీఎం పదవి అతను వేరొకరికి ఇవ్వడం అనేది కల్ల.కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు ఆయన ఇలా మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నాడని ఓ టీడీపీ నాయకుడు ఆదివారం విమర్శించాడు. కాంగ్రెస్ కూడాఇలా కులాల పేరు చెప్పి ఓట్లు సంపాదించుకోవాలనుకోవడం దుస్సంప్రదాయం అనివిమర్శించింది.