ఇ- లెర్నింగ్కు గేట్స్ ఆర్థిక అండ
న్యూఢిల్లీ:
శిక్ష
పేరుతో
అమలవుతున్న
ఇ-లెర్నింగ్
ప్రాజెక్టు
కోసం
మైక్రోసాఫ్ట్
అధినేత
బిల్
గేట్స్
20మిలియన్
డాలర్ల
సహాయం
అందించడానికి
సిద్ధపడ్డారు.
దీంతో
పాటు
మీడియా
ల్యాబ్
ఆసియా
ప్రాజెక్టుకు
పది
లక్షల
డాలర్లుఅందిస్తారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ప్రమోద్ మహాజన్తో గంట పాటు జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ ఆ సహాయంఅందించడానికి ముందుకు వచ్చారు. బిల్ గేట్స్ ఇచ్చే 20మిలియన్ డాలర్లతో ఇ- లెర్నింగ్ శిక్ష కింద బోధకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మూడు నుంచి ఐదేళ్ల పాటు అమలు చేస్తారు.
అంతకు ముందు మహాజన్ మీడియా ల్యాబ్ ఆసియా ప్రాజెక్టు గురించి బిల్ గేట్స్కువివరించారు. ఈ సామాజిక, ఆర్థిక పథకానికి విదేశీ నిధుల అవసరం గురించివివరిస్తూ మైక్రోసాఫ్ట్ సహాయం అందించగలదని మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇ- లెర్నింగ్ శిక్ష కింద 80 వేల మంది బోధకులకు, 3.5మిలియన్ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రాజెక్టును ఐటి శాఖ సమన్వయపరుస్తుంది.
గత రెండేళ్లలో దేశంలో జరిగిన టెలికమ్ అభివృద్ధి గురించి, ఇ-గవర్నెన్స్ కోసం డిజిటల్ డివైడ్, సామాజిక సమాచార కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి మహాజన్, బిల్ గేట్స్ మాట్లాడుకున్నారు.