వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగాల్ వైపు మళ్ళిన వాయుగండం!
విశాఖపట్నం: తుఫాన్ గండం నుంచి కోస్తాంధ్రా బయటపడింది. పంట కోతలకు వచ్చిన సమయంలో తుఫాన్ రానుందన్న వార్తలు రావడంతో రైతులు ఆందోళన చెందారు. సోమవారం ఈశాన్యదిశగా బలపడిన వాయుగండం మంగళవారం దిశ మార్చుకొంది. దీంతో కోస్తాంధ్రా రైతులు ఊపిరిపీల్చుకున్నారు.
ఒరిస్సా, పశ్చిమబెంగాల్ ల వైపు దాని దిశ మారింది.ఒరిస్సాలోని కోస్తా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నానికి తీరం దాటవచ్చనివిశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అంచనావేస్తోంది.
గంటకు 80 మైళ్ళ వేగంతో వాయుగుండం ప్రయాణిస్తోంది. పలుచోట్లఒరిస్సాలో మంగళవారం ఉదయం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయనిఒరిస్సా భువనేశ్వర్ వాతావరణ శాఖ అధికారి మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు. తీరప్రాంతంలోని పలు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలనందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Comments
Story first published: Tuesday, November 12, 2002, 23:53 [IST]