వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుపై చర్చ- ప్రభుత్వంపై ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వంవిఫలమైందంటూ ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభలోవిమర్శలకు దిగాయి. కరవు సహాయక చర్యలపై శాసనసభలో చర్చ జరిగింది.

కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నీటిపారదలు ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇర్రిగేషన్‌ ప్రాజెక్టులకు వేసిన పునాది రాళ్లు సమాధిరాళ్లుగా మారాయని ఆయన అన్నారు.

కరవు సహాయక చర్యల కింద వస్తున్న బియ్యం, నిధుల వల్ల తెలుగుదేశం కార్యకర్తలకు లాభం చేకూరుతోంది కాబట్టి ప్రభుత్వం కరవు నివారణకుశాశ్వత చర్యలు చేపట్టడం లేదని ఆయనవిమర్శించారు. నిర్ణీత కాలవ్యవధిలో నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. వ్యవసాయానికి యేటా రెండు లక్షల కరెంట్‌ పంపుసెట్ల కనెక్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.సిపిఎం, బిజెపిలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X