వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరులో భారీ సాగునీటి ప్రాజెక్ట్
హైదరాబాద్: గత పదిరోజులుగా తెలంగాణా, కోస్తా జిల్లాలను వణికిస్తోన్న చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కనిష్ట ఉష్ణోగ్రతలోపెద్దగా మార్పు లేకున్నప్పటికీ వాతావరణంలో తేమ పెరగడంతో చలి తగ్గినట్లు కన్పిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలిపులి విజృంభించడంతోవిజయవాడ, గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో జ్వరాలతో బాధపడుతోన్న వారి సంఖ్యపెరిగింది.
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ప్లూతో బాధపడే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే, కోస్తా, తెలంగాణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రాథమిక కేంద్రాల్లో వైద్యులు నిరంతరంఅందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
Comments
Story first published: Tuesday, November 12, 2002, 23:53 [IST]