వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాల పట్టు - ప్రభుత్వం బెట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పారా మెడికల్‌ పోస్ట్‌ ల భర్తీపై కాంగ్రెస్‌,సీపీఎంలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. బుధవారం ఉదయంఅసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే, విపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అయితే, ప్రభుత్వం మాత్రంకరువుపై చర్చను విపక్షాలు నీరుగారుస్తున్నాయనివిమర్శిస్తూ దీనిపై చర్చకు నిరాకరించింది. చర్చ జరగాలని పట్టుబట్టడంతో ఉదయం 20 నిమిషాల పాటు సమావేశాలకు అంతరాయం కలిగింది.

ప్రభుత్వం నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు వేరే మార్గంలేకే, వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాం. అంతేగానీ కరువుపై చర్చను పక్కదారి పట్టించడం కాదనిసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి వివరణ ఇచ్చారు.

సమాచారం కోసమే అడిగితే, వెంటనే సమాధానం ఇస్తాం. కానీ సాగదీస్తే..సభా సమయం వృధా అవుతుంది.విపక్షాల ఉద్దేశం వృధా చేయడంలాగా కన్పిస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృషుడు అనడంతోవిపక్షాలు మండిపడ్డాయి. కొద్దిసేపు గందరగోళం తర్వాత సమావేశాలు యధావిధిగా జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X