వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ రుణాలు చెల్లింపు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరువు ప్రాంతాల్లో రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపును ఏడాదిపాటు వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. వ్యవసాయ రుణాలు తీసుకొన్న కరవు ప్రాంతాల రైతులు ఏడాది పాటుఅసలు గానీ, వడ్డీ గానీ చెల్లించక్కర్లేదని ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌ పేయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరువు ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ సారధ్యంలోనిటాస్క్‌ ఫోర్స్‌ కమిటీ త్వరలో సమావేశమై నిధుల విడుదల గురించి నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని తెలిపారు. 500 కోట్ల రూపాయతో కార్పస్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయనవివరించారు. ఈ కార్పస్‌ ఫండ్‌ తో రైతులు ఎప్పుడు కష్టాల ఊబిలో పడినా, వెంటనే ఆదుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X