ఈ రాత్రికి హైదరాబాద్ కు గేట్స్
హైదరాబాద్: బుధవారం రాత్రి 10.30 గంటలకు మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ కువిచ్చేస్తారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ లోని స్టార్ హోటల్ తాజ్ కృష్ణలో బస చేస్తారు. ఆయనను ఘనంగాస్వాగతించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రోడ్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డంతా బుధవారంఅందంగా తీర్చిదిద్దారు.
ఆ
రోడ్డు
పొడువునా
ఎం.సి.ఎచ్,
ఇతర
ప్రభుత్వ
సంస్థలుపెద్ద,
పెద్ద
హోర్డింగ్
లు,
బ్యానర్లను
అమర్చారు.స్వాగత
బ్యానర్లను
బుధవారం
మధ్యాహ్నమే
బేగంపేట
రోడ్
లో
అమర్చారు.
భద్రతా
ఏర్పాట్లను
పోలీసులు
సమీక్షిస్తున్నారు.
గేట్స్
రాత్రి
11
గంటల
ప్రాంతంలో
వస్తుండగా,
అధికారులు
ఇప్పట్నుంచే
హడావుడి
చేస్తున్నారు.
ఈ
రోడ్డులో
ఇప్పుడే
ట్రాఫిక్
ను
క్రమబద్దీకరించారు.
ఆయన
గురువారం
ఉదయం
నుంచి
పలు
కార్యక్రమాల్లో
పాల్గొంటారు.
ఇదీ ఆయన షెడ్యూలు
- గురువారం 10 -11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జూబ్లీ హాల్ లో ప్రత్యేక సమావేశం
- 12 గంటలకు షాద్ నగర్ కు హెలికాప్టర్ లో ప్రయాణం. అక్కడ ఇమ్యూనేజన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
- 1.45 గంటలకు టెక్నాలజీ సెంటర్ ను సందర్శిస్తారు.
- 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మైక్రోసాప్ట్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ లో గడుపుతారు.
- 7.45 గంటలకు శిల్పాకళావేదికలో జరిగే ఇ-గవర్నెన్స్ సమావేశంలో ప్రసంగిస్తారు.
- రాత్రి పదిగంటలకు అమెరికా బయలుదేరుతారు.