ఆస్థులపై అంచనాకు సిద్దం: వై.ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నతాధికారుల అవినీతిపై బుధవారంఅసెంబ్లీలో జరిగిన చర్చ వాడి,వేడిగా జరిగింది. అవినీతి అధికారుల చిట్టాను బయటపెట్టాలనివిపక్షాలు డిమాండ్ చేశాయి. తొలుత అధికారుల జాబితా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అనంతరం నిరాకరించడంతోవిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. గంటసేపు సభా వాయిదా పడింది. అవినీతి అధికారులపై జరిగిన చర్చ మరో మలుపు తిరిగి రాజకీయ నేతల ఆస్తులపైకి మళ్ళింది.
అవినీతి అధికారుల జాబితా విడుదలపై మంత్రిఅశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. దీనిపై భారీనీటిపారుదల శాఖమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ..1978లో వై.ఎస్. ఆస్తులు ఎంతో...ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంతగా పెరిగాయో బయటపెట్టాలని అన్నారు. దీంతో...వై.ఎస్. ఆనందంగా లేచి..అందుకు తాను సిద్దమేనని ప్రకటించారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జిగానీ, అంతకన్నా తక్కువ స్థాయిగానీ అధికారితో నా ఆస్తులను పరిశీలించండి. ప్రభుత్వంమీది. నేను సిద్దమే. అయితే, అదే 1978లో ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులను కూడా అదే రీతిలో ఆస్తులను లెక్కగట్టాలని ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు.