ఇమ్యూనైజేషన్ కు మరిన్ని నిధులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇమ్యూనైజేషన్ ప్రక్రియకు మరిన్ని నిధులుఅందచేసేందుకు మిలిందా పౌండేషన్ అంగీకరించింది. ఉచిత టీకాల రెండో దశను ఆ పౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో బుధవారం ప్రారంభించారు. బుధవారం నుంచి ఆదిలాబాద్, కృష్ణా,శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కేంద్రాలలో హెపటైటిస్ -బి టీకాలను ఉచితంగాఅందిస్తారు. రాష్ట్రంలోని బయోటెక్ కంపెనీలతో టీకాల ఉత్పత్తికి కలిసి పనిచేస్తామని గేట్స్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇమ్యూనైజేషన్ ప్రక్రియ కోసం 25మిలియన్ డాలర్లను అందచేస్తున్నాం. ఐదేళ్ళపాటుసాగే ఈ ప్రాజెక్ట్ కు అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో ఎయిడ్స్ నివారణకు పూర్తి సాయంఅందిస్తామని మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ అభయం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎయిడ్స్ మహమ్మరి నివారణలో ఆదర్శరాష్ట్రంగా మలిచేందుకు సాయం చేస్తామన్నారు.