వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూలిన మిగ్, పైలట్ల మృతి
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ లోని బగ్ దోగ్రా వైమానిక స్థావరం వద్దమిగ్ విమానం గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలోపైలెట్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు స్క్వాడ్రన్ లీడర్ ధింగ్రా న్యూఢిల్లీలో చెప్పారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.
శిక్షణా విమానమైన ఈ మిగ్ 20 నిమిషాల పాటు గాలిలో తిరిగి బగ్ దోగ్రా వైమానిక స్థావరానికి తిరిగి వస్తుండగా కుప్పకూలిందని ఆయన చెప్పారు. పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.
Comments
Story first published: Thursday, November 14, 2002, 23:53 [IST]