వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్ర చేపడుతాం:వీఎచ్‌ పి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: ఎన్నికల సంఘం ఆదేశాల్ని ఖాతరు చేయకుండావిజయయాత్ర చేపట్టాలని విశ్వహిందూపరిషత్‌(వీఎచ్‌ పి) నిర్ణయించింది. ఈ నెల 17న గోద్రాలో యాత్రను చేపడుతామనివీఎచ్‌ పి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియా గురువారం ప్రకటించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌ జె.ఎం.లింగ్డో తన ఫరిధిలో లేనివిషయాలపై కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయనవిమర్శించారు. లింగ్డోను ఆయన హిందూవుల వ్యతిరేకిగా అభివర్ణించారు.

లింగ్డో తన అభిప్రాయాలను ఇతరులమీద రుద్దే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకే ఆయన పరిమితమైతే దేశానికీ, ఆయనకూ మంచిది. అని తొగాడియా అన్నారు. యాత్రకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చినందున ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తొగాడియా తెలిపారు.

తమ యాత్రలో ఎటువంటి హింసకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇది సాధువుల యాత్రని ఆయన వివరించారు. డిసెంబర్‌ ఆరున అహ్మదాబాద్‌ లో యాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X