యాత్ర చేపడుతాం:వీఎచ్ పి
అహ్మదాబాద్: ఎన్నికల సంఘం ఆదేశాల్ని ఖాతరు చేయకుండావిజయయాత్ర చేపట్టాలని విశ్వహిందూపరిషత్(వీఎచ్ పి) నిర్ణయించింది. ఈ నెల 17న గోద్రాలో యాత్రను చేపడుతామనివీఎచ్ పి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా గురువారం ప్రకటించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ జె.ఎం.లింగ్డో తన ఫరిధిలో లేనివిషయాలపై కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయనవిమర్శించారు. లింగ్డోను ఆయన హిందూవుల వ్యతిరేకిగా అభివర్ణించారు.
లింగ్డో తన అభిప్రాయాలను ఇతరులమీద రుద్దే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకే ఆయన పరిమితమైతే దేశానికీ, ఆయనకూ మంచిది. అని తొగాడియా అన్నారు. యాత్రకు కలెక్టర్ అనుమతి ఇచ్చినందున ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తొగాడియా తెలిపారు.
తమ యాత్రలో ఎటువంటి హింసకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇది సాధువుల యాత్రని ఆయన వివరించారు. డిసెంబర్ ఆరున అహ్మదాబాద్ లో యాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు.