వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గెయిల్ సెంచరీ, విండీస్: 324/4
అహ్మదాబాద్: కట్టుదిట్టమైన భద్రతల మధ్య భారత్, వెస్టీండీస్ ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ధాటిగా ఆడతూ స్కోర్ ను పరుగులెత్తించింది. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. వెస్టీండీస్ ఆటగాళ్ళు విజృంభించి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ గెయిల్, భారత్ పై నిలకడగా రాణిస్తోన్నశర్వాన్ లు భారత్ బౌలింగ్ లోని లోటుపాట్లను తమ బ్యాటింగ్ తో ఎత్తి చూపారు. క్రిస్ గెయిల్ 140 పరుగులు చేశాడు.శర్వాన్ 99 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ కార్ల్ హూపర్ కూడా రాణించి 36 పరుగులు చేశాడు. వెస్టీండీస్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగువికెట్ల నష్టానికి 324 పరుగుత భారీ స్కోర్ ను సాధించింది.
Comments
Story first published: Friday, November 15, 2002, 23:53 [IST]