వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్ర నిషేధం సబబే: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్‌ తలపెట్టదలచినవిజయ యాత్రను ఎన్నికల సంఘం నిషేధించడాన్ని ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌ పేయి సమర్ధించారు. గుజరాత్‌ లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంఘం నిషేధం సబబేనని ఆయన ఆజ్‌ తక్‌ టెలివిజన్‌ ఛానల్‌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోపేర్కొన్నారు. నిషేధంపై తమ పార్టీ బిజెపి విమర్శించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నందున, మతపరమైన ర్యాలీలను నిషేధించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి.పైపైన ఆలోచిస్తే నిషేధం విధింపులో పాక్షికత కన్పించవచ్చు. కానీ సమగ్రంగా ఆలోచించేఇ.సి. ఈ నిర్ణయం తీసుకొందని భావిస్తున్నాని వాజ్‌పేయి వివరించారు.

విఎచ్‌ పి ఐనా, మరే సంస్థ ఐనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో నిరసనను కూడా శాంతియుతంగా తెలయచేయాలని ప్రధాని హితవు పలికారు. అన్ని పార్టీలు సంయమనంగా, భాద్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రధాని రాజకీయ, మత వర్గాల నాయకులనుకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X