వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రమంతటా మారిన టెలిఫోన్ నెంబర్లు
హైదరాబాద్: ఆదివారం నుంచి రాష్ట్రంలో కొత్త టెలిఫోన్ నెంబర్లు అమల్లోకి వచ్చాయి. జాతీయ ఐడెంటిఫికేషన్ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో బిఎస్ ఎన్ ఎల్ ఫరిధిలోని నెంబర్లను ఆదివారం నుంచి మార్చారు.
ఎ.పి.టెలికాం సర్కిల్ ఫరిధిలో ల్యాండ్ ఫోన్ల నెంబర్లు మారాయి. ప్రస్తుతం ఉన్న అన్ని నెంబర్లకు కొత్త నెంబర్లను ఇచ్చారు. ఏడుఅంకెల నెంబర్ ఎనిమిదికి మారగా, ఆరు ఏడుకి, ఐదు ఆరుకి మారింది. ఇక ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్ ఐన టాటా టెలికాం నెంబర్ల మార్పు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తుంది. మారిన నెంబర్లను ఎపి టెలికాం వెబ్సైట్ లో చూసుకోవచ్చు.
Story first published: Sunday, November 17, 2002, 23:53 [IST]