వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా వైస్‌ ఛాన్సలర్‌ అతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెషర్‌ వై.సి.సింహాద్రి వైఖరి సమంజసంగా లేదని రాష్ట్ర ప్రభుత్వంఅంగీకరించింది. గత కొద్ది రోజులుగా ఆంధ్రా యూనివర్శిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైస్‌ ఛాన్సలర్‌ వైఖరిని నిరసిస్తూవిద్యార్థులు ఆందోళన చేస్తుండడంతో యూనివర్శిటీలో నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఆదివారం కొద్దిగావీటిని సడలించారు. అయితే, ప్రొఫెషర్‌ సింహాద్రి వైఖరిపైఅసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.

వైస్‌ ఛాన్సలర్‌ పై ప్రభుత్వానికి అదుపులేదా అని ప్రశ్నించాయి.విద్యార్థునులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అనిసీపీఎం నాయకులు ప్రశ్నించారు.

దీనిపై మంత్రి ఎన్‌.ఎం.డి ఫరూఖ్‌ స్పందిస్తూ..ఛాన్సలర్‌ వైఖరి సబబుగా లేదనిఅంగీకరించారు. పూర్తి నివేదిక తెప్పించాక చర్యలు చేపడుతామని ఆయన తెలియచేశారు. అయితే,విద్యార్థులు సంయమనం పాటించాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X