వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మండల కేంద్రానికో డిస్పెన్సరీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మండలకేంద్రాల్లో అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యూనానీ డిస్పెన్సరీలను ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. త్వరలో అన్ని మండల కేంద్రాల్లో పక్కా భవనాలను నిర్మించి అక్కడ ఈ డిస్పెన్సరీలను ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు తెలిపారు. సోమవారంఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, సీపీఎంలుఅడిగిన ప్రశ్నలకు సమధానంగా ఈవిషయాన్ని తెలియచేశారు.
కేవలం పదివేల మందులను మాత్రమే ప్రభుత్వం సరాఫరా చేస్తోందని, కేటాయింపులను మరింతపెంచాలని నోముల నర్సింహులు కోరారు. ఇందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రజలందరికీ వైద్యంఅందుబాటులోకి వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోడెల చెప్పారు.
Comments
Story first published: Monday, November 18, 2002, 23:53 [IST]