వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ పై వెస్టీండీస్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

బరోడా: భారత బౌలర్ల మరోసారినిరుత్సహపరిచారు. బలహీన మైన భారత బౌలింగ్‌ను వెస్టీండీస్‌ ఆటగాళ్ళు చీల్చిచెండాడంతోబరోడాలో జరిగిన 5వ వన్డే మ్యాచ్‌ లోవెస్టీండీస్‌ ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో భారత్‌ పైగెలుపొందింది. దీంతో భారత్‌ పై 3-2 తోవెస్టిండీస్‌ అధిక్యంలో ఉంది.

48 ఓవర్లకు కుదించిన ఈమ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ భారీ స్కోర్‌ (290)సాధించనప్పటికీ వెస్టీండీస్‌ బ్యాట్స్‌ మెన్‌ బ్యాటింగ్‌ ప్రతాపంముందు భారత్‌ బౌలర్లు చతికిలా పడ్డారు. చురకుదనం లేనిపీల్డింగ్‌ మూలానా భారత్‌ భారీ మూల్యాన్నిచెల్లించింది.

ఎంత భారీ స్కోరైనా సాధించగలిగే భారత్‌ఎదుటిపక్షం బ్యాట్స్‌ మెన్‌ ను మాత్రంకట్టడిచేయలేకపోతున్నారు. సోమవారం ఉదయంటాస్‌ గెలిచి వెస్టీండీస్‌ ఫీల్డింగ్‌ కు దిగింది. ఓపెనర్లుగంగూలీ, సెహ్వాగ్‌ లు ధాటిగా ఆడుతూ స్కోర్‌ ను పరుగెత్తించారు.గంగూలీ, సెహ్వాగ్‌ లిద్దరూ హాఫ్‌ సెంచరీలుచేశారు.

అనంతరం ద్రావిడ్‌, లక్ష్మణ్‌ లు కూడా ధాటిగా ఆడుతూ స్కోరువేగాన్ని పెంచారు. ద్రావిడ్‌ 33 పరుగులకు ఔట్‌ కాగా, లక్ష్మణ్‌ 71 పరుగులు చేశాడు. 48ఓవర్లలో భారత్‌ 290 పరుగుల భారీ లక్ష్యాన్నివెస్టీండీస్‌ ముందు ఉంచింది. వెస్టీండీస్‌ ఓపెనర్లు కూడా భారత్‌ పై విరుచుకుపడ్డారు.ఫీల్డింగ్‌ సడలించే 15 ఓవర్లలోనే 132 పరుగులుసాధించి వారు తమ ఉద్దేశాన్ని చాటారు.

ఓపెనర్‌క్రిస్‌ గెయిల్‌ 107 బంతుల్లో 101 పరుగులు, వేవెల్‌ హిండ్స్‌ 80 పరుగులు చేసివెస్టిండీస్‌ ను పటిష్టస్థితికి చేర్చగా, కార్ల్‌హూపర్‌ పావెల్‌ తో 50 పరుగుల భాగస్వామ్యంతోవెస్టిండీస్‌ ను విజయాన్ని అందించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X