కాంగ్రెస్ బియ్యం..కాదు టీడీపీవే
హైదరాబాద్: పనికి ఆహార పథకం బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన ఓ గిడ్డంగుపై సోమవారం అధికారులు దాడి చేశారు. ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. దాదాపు 527 కోట్ల బియ్యం పట్టుబడగా, ఈ బియ్యంపై కాంగ్రెస్, టీడీపీలు పరస్పరంపెద్ద ఎత్తున ఆరోపణలు జల్లుకున్నాయి.
పనికి ఆహారపథకంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చెప్పడానికి ఈ బియ్యం ఉదహరణ అని కాంగ్రెస్విమర్శించింది. ఈ బియ్యం నిల్వచేసిన గిడ్డంగినిసీఎల్పీనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సందర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కాంట్రాక్టర్లు టీడీపీకి చెందిన వారని ఆయన ఆరోపించారు. అనంతరం టీడీపీకి చెందిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పైవిమర్శలు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పుష్పలీల, టీడీపీ అధికార ప్రతినిధి ఎన్.శివప్రసాద్, విప్ కాగితం వెంకట్రావ్ లు గిడ్డంగులను సందర్శించారు. ఈ గిడ్డంగిని నిర్వహిస్తోన్న పాండులు, రాములు కాంగ్రెస్ వారేనని వారు ఆరోపించారు.