గుజరాత్ పై నిలదీసినవిపక్షాలు
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్, బిజెపిలపైవిపక్షాలు మండిపడ్డాయి. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గుజరాత్అంశంపై విపక్షాలు నిలదీశాయి. గుజరాత్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజీపీ మతసామరస్యానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తోందని ప్రశ్నోత్తరాల సమయంలో చర్చను ప్రారంభించినసీపీఎం నేత సుభోద్ రాయ్ ఆరోపించారు. ఎన్నికలు ముందువీఎచ్ పీ యాత్ర పేరిట మతవిద్వేషాలను రేపేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలువిమర్శించారు.
గుజరాత్ అంశంపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానానికిస్పీకర్ మనోహర్ జోషి అనుమతి ఇచ్చారు. తీర్మానంపై జరిగిన చర్చల్లో కాంగ్రెస్ బీజీపీపై విరుచుకుపడింది. మతతత్వ శక్తులకు బిజెపి పట్టుగొమ్మగా మారిందనివిమర్శించింది. ప్రవీణ్ తొగాడియా లాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరమనిపేర్కొంది. వీఎచ్ పీ కూడా బీజీపీలో భాగం మాదిరిగా ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.