వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ ఘాతుకం, 21 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: నక్సల్స్‌ మరోసారి తప్పిదం చేశారు. వారి పొరపాటుకు 21 మంది పౌరుల నిండు ప్రాణాలు బలయ్యాయి. వరంగల్‌ జిల్లా ఏటూరునాగరం అడవుల్లోని కన్నాయిగూడెం పరిసరప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఓ ఆర్టీసీబస్‌ ను పేల్చివేశారు. ఇందులో ప్రయాణిస్తోన్న 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రయాణిస్తోన్నబస్‌ అనుకొని పొరబడి ఆర్టీసీ బస్సును పేల్చివేశారు.

వరంగల్‌ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన ఏటూరునాగరం అడవుల్లో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వారిలో అత్యధికులు గిరిజనులే. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సాధారణంగాస్పెషల్‌ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. దీంతో వార్‌ ఆర్టీస్‌ పోలీసుల కోసం వల పన్ని ఆర్టీసీ బస్సునుపేల్చివేసింది. వార్‌ అంచనాలకు భిన్నంగా పోలీసు అధికారులు సాయంత్రం ఆరుగంటలకే ఏటూరునాగారానికి చేరుకున్నారు.

వార్‌ తుపాకులగూడెం రహదారిలో మందుపాతరను అమర్చింది. సాయంత్రం ఆరుగంటల నలుభైఅయిదు నిమిషాలకు పేల్చివేసింది. బాంబు తీవ్రతకుబస్‌ బోల్తాపడింది. గాయపడినవారు బస్‌ అద్దాలన పగులగొట్టుకొని వచ్చారు. వారు కిలోమీటర్‌ దూరం నడిచి వచ్చి దగ్గర్లోని గ్రామం నుంచి ఏటూరునాగరం పోలీసులకు సమాచారాన్నిఅందించడంతో అధికారులు హుటాహుటిన తరలి వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X