వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాకు వాజ్ పేయి చురకలు
న్యూఢిల్లీ: ఒక దేశం అభిప్రాయాలను మరో దేశంపై రుద్దకూడదని అన్యాపదేశంగా అమెరికాకు ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి చురకలు అంటించారు. ఇరాక్ పై అమెరికా బాంబుదాడికి పాల్పడేందుకు సిద్దమౌతోన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
మంగళవారం గురునానక్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన సిక్కుల సమావేశంలో వాజ్పేయి ప్రసంగించారు. అన్ని దేశాల ప్రజలకు తమ దేశాన్ని తమకు నచ్చిన రీతిలో పాలించుకునే హక్కు ఉంటుందని ఆయన అన్నారు.ఇరాక్ లో మరో యుద్దం జరగకూడదని కోరుకుంటున్నాం. అన్ని సమస్యలను ఐక్యరాజ్యసమితి ద్వారా పరిష్కరించుకోవాలని వాజ్పేయి సూచించారు. ఏ ఒక్క దేశమూ తన మనోభిష్టాలను మరో దేశంపై రుద్దకూడదని ఆయన అమెరికాపైవిమర్శలు చేశారు.
Comments
Story first published: Tuesday, November 19, 2002, 23:53 [IST]