వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ లో ఆర్టీసీ బంద్
వరంగల్: వార్ బస్సు పేల్చివేత దుర్ఘటనను నిరసిస్తూ వరంగల్ లో ఆర్టీసీ సిబ్బంది మంగళవారం బంద్ ను నిర్వహించారు. నగరంలోని అన్ని బస్సు డిపోలలో వద్ద ధర్నా నిర్వహించి, ఆర్టీసీ బస్సులు నడవకుండా బంద్ చేపట్టారు. తోటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై వారు చలించిపోయారు. ఆర్టీసీ కార్మికులు, కుటుంబాల్లో అంతులేనివిషాదం అలుముకొంది. ఈ ఘటనలో బస్ డ్రైవర్, కండక్టర్ మరణించారు.
మారుమూల పల్లెల్లో బస్సు సౌకర్యాన్ని కల్పించడమనేదిసేవ. మా సేవకు గుర్తింపు ఇదాని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బందికి భద్రత లేకుండా పోయిందని వారువిచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతోన్న వార్ ఆర్టీసీ బస్సుల్ని టార్గెట్ చేసుకుంటోంది. ఇక మా ప్రాణాలకు రక్షణ ఏదీ అని కార్మికులు ప్రశ్నించారు. వరంగల్ నగరంఅంతా వారు బంద్ ను చేపట్టారు.
Comments
Story first published: Tuesday, November 19, 2002, 23:53 [IST]