వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వచ్చే నెల సోనియా గుంటూరు పర్యటన
హైదరాబాద్ః ఎఐసిసి అధ్యక్షురాలుసోనియాగాంధీ డిసెంబర్ 21న గుంటూరు జిల్లాకువస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంవీరన్నపాలెం గ్రామంలో ఆచార్య ఎన్ జి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికిసోనియా గాంధీ అంగీకరించినట్టు ఆచార్య ఎన్ జి రంగాఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు.
సోనియాగాంధీ వెంట పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు, సిఎల్పీ నాయకుడు డాక్టర్వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విగ్రహావిష్కరణ సభలోపాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, బిజెపి జాతీయ అధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడిని కూడా ఈ సభకుఆహ్వానించినప్పటికీ వీరిద్దరూ ఇంకా ధృవీకరించలేదు. .
Comments
Story first published: Tuesday, November 19, 2002, 23:53 [IST]