వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడు లక్షలఎక్స్ గ్రేషియా: సీఎం
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన బస్సుపేల్చివేత సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారంఎక్స్ గ్రేషియా వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఅసెంబ్లీలో ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలతో పాటు, ఉచితంగా ఇండ్ల స్థలం ఇస్తాం. అలాగే కుటుంబంలోని ఒకరికి ఉపాధిని కల్పిస్తామని ఆయన తెలిపారు.
దుర్ఘటనలో వైకల్యానికిగురైన వారికి లక్షరూపాయలను ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలివ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. క్షతగాత్రులను మంగళవారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. తొమ్మిదిమంది ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒక మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Story first published: Tuesday, November 19, 2002, 23:53 [IST]