వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెలపై అసెంబ్లీలో దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేసుల్లో ఇరుక్కున్న నాయకులపై బుధవారంఅసెంబ్లీలో జరిగిన చర్చ పెద్ద దుమారాన్ని రేపింది. అవినీతి నేతలను, కేసులో ఇరుకున్న వారిని టీడీపీ కొమ్ముకాస్తుందని కాంగ్రెస్‌విమర్శించింది. దీనిపై చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాద్‌ రావు కాంగ్రెస్‌ ప్రతిదాడికి దిగారు.

తనను సమర్ధించుకునే ప్రయత్నంలో ప్రతిపక్ష నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డిపై వ్యక్తిగతవిమర్శలు చేయడంతో చర్చ పక్కదారిపట్టింది. టీడీపీ, కాంగ్రెస్‌ ల ప్రతివిమర్శలతోఅసెంబ్లీ దద్దరిల్లింది. వై.ఎస్‌. కుటుంబం అంతా ఫ్యాక్షన్‌ కుటుంబం. ఆయన మాపైవిమర్శలా అంటూ కోడెల వై.ఎస్‌ పై ఆరోపణలు గుప్పించారు.

ఆయన పేరుకే డాక్టర్‌ చేసేది అన్ని ఫ్యాక్షన్‌ పనులని కోడెల విమర్శించడంతో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుతగిలారు. చర్చపై కోడెల ఇచ్చిన సమాధానాన్ని రికార్డుల నుంచి తొలగిస్తాననిస్పీకర్‌ హామీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ వారు దానికిఅంగీకరించలేదు.

కోడెలపై ప్రతి విమర్శలకు దిగారు. స్పీకర్‌ వద్దకు దూసుకువచ్చి హంగామా చేశారు.సిబిఐ ఆయనను తప్పుబట్టింది. ఇది అక్షరాలా నిజం. అది కాదని నిరూపించండని వై.ఎస్‌ ప్రభుత్వానికి సవాల్‌విసిరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X