రమణపై చర్య తీసుకుంటాం: వడ్డే
హైదరాబాద్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎం.డి కె.వి.రమణపై బుధవారంఅసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం ఇరుకున పడింది.విపక్షాలు వాదన ముందు ప్రభుత్వం విలవిలలాడింది.సరైనా సమధానం ఇవ్వలేక ఇబ్బందిపడింది. విత్తనాభివృద్ది సంస్థ ఎం.డి రమణను నివేదిక తప్పుపట్టినప్పిటికీ ప్రభుత్వం ఎందుకు వెనుకేసుకు వస్తుందో చెప్పాలనివిపక్షాలు డిమాండ్ చేశాయి. రమణ తప్పు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభానాద్రిశ్వరరావుఅంగీకరించారు.
అయితే, ఆయనను ఎందుకు తొలగించడం లేదని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. దానికి వడ్డేసరైనా సమాధానం ఇవ్వలేకపోయారు. రెండు, మూడు రోజుల్లో చర్య తీసుకుంటామని ఆయన అనడంతోవిపక్షాలు పెద్ద ఎత్తున అడ్డు తగిలారు. రెండు, మూడు రోజులు ఎందుకని ఆయన సమాధానానికి అడ్డు తగిలారు.విస్తుపోయిన వడ్డే చర్య తీసుకుంటాం. కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని పాటించాలి కదా అని కూర్చొండిపోయారు.