వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రన్నాయుడు, రేణుకా వాగ్వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్‌ లో బుధవారం కరువుపై జరిగిన చర్చను టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు దారి మల్లించారు. రాష్ట్రంలోని కరువుపై పార్లమెంట్‌ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు వాగ్వివాదానికి దిగారు.

టీడీపీపీ నాయకుడు ఎర్రన్నాయుడు రాష్ట్రంలోని కరువును వివరిస్తుండగా, కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడ్డుతగిలారు.మీ రాష్ట్ర ప్రభుత్వం కరువు చర్యలు తీసుకోవడంలోవిఫలమైంది. దాన్ని గురించి వివరించండి అంటూ ఆమె వాదనకు దిగారు.

దీంతో ఎర్రన్నాయుడు ఆగ్రహంచెందారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలోమిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఎటువంటి ఆకలి చావులు సంభవించలేదని ఎర్రన్నాయుడువిమర్శించారు. ఐనప్పటికీ కాంగ్రెస్‌ ఎంపీలు టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు విసరడంతో సభలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది.స్పీకర్‌ మనోహర్‌ జోషి జోక్యంతో ఇరుపక్షాల నేతలు వెనక్కితగ్గారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X