వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దోషులను పట్టుకుంటాంఃహోం మంత్రి
హైదరాబాద్ః గురువారం రాత్రి దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి వద్ద స్కూటర్ బాంబు పేలడం పట్ల శుక్రవారం కాంగ్రెస్, బిజెపి సభ్యులుఅసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను పట్టుకుంటామని, అవసరమైతేపోటా చట్టాన్ని అయినా ప్రయోగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హోం మంత్రి దేవేందర్ గౌడ్ హామీ ఇచ్చారు.
మతోన్మాదులైన ఉగ్రవాదుల ఘాతుకాలను అరికట్టడానికి ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట ప్రణాళిక ఏమైనా ఉన్నదా అని బిజెపి శాసన సభాపక్ష నాయకుడు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం తర్వాత నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వానికి మామూలైపోయిందని ఆయనవిమర్శించారు. బాంబు పేలుడు సంభవించడానికిఅరగంట ముందే అతి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు కాల్ వచ్చినా పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని తెలుగుదేశం శాసన సభ్యుడు కృష్ణాయాదవ్ ప్రశ్నించారు.
Comments
Story first published: Friday, November 22, 2002, 23:53 [IST]