వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి వెనుక పాక్‌ హస్తం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూలోని రఘునాథ్‌ ఆలయంపైన దాడి వెనుక పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ తెలిపారు. దాడిపై అద్వానీ సోమవారం లోక్‌ సభలో ఓ ప్రకటన చేస్తూ పాకిస్థాన్‌ పై ఆరోపణలు గుప్పించారు.పాకిస్థాన్‌ లో తాజాగా ప్రభుత్వం ఏర్పడ్డాక మన దేశంలో ఉగ్రవాదులఅరాచకాలు పెరుగుతుండడాన్ని ఆయన ఉదాహరించారు. ఉగ్రవాదులు జరిపిన వివిధ కమ్యూనికేషన్ల సమాచారాన్ని బట్టి ఆలయంపై దాడి అల్‌ మన్‌ సూరన్‌ సంస్థ పని అని తెలుస్తోందని ఆయన తెలిపారు. ఇది లష్కరే తోయిబాకు మారుపేరు.

దేశ భద్రతవిషయంలో రాజీపడేది లేదు. పొరుగుదేశం చర్యలను సమర్దంగా తిప్పికొడుతామని అద్వానీ లోక్‌ సభలో స్పష్టం చేశారు. జమ్మూలోని రఘునాథ్‌ దేవాలయంపై ఆదివారం జరిగిన దాడిలో 13 మంది మరణించారు.

ఈ దాడిలో పాల్గొన్న మూడో తీవ్రవాదిని సైతం పోలీసులు సోమవారం కాల్చిచంపారు. ఈ ఘటనను పాకిస్థాన్‌ ఖండించింది. అమెరికా రాయబారి బ్లాక్‌ వెల్‌ దీన్ని అమానుష చర్యగా అభివర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X