వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడిపై దాడి- 13మంది బలి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: ఇద్దరు సాయుధ లష్కర్‌- ఎ- తోయిబామిలిటెంట్లను హతం చేయడంతో రఘునాథ ఆలయం భద్రతా బలగాల చేతిలోకి వచ్చింది. ఆదివారం అర్థరాత్రి ఇద్దరుమిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి.మిలిటెంట్ల దాడిలో 13 మంది మరణించారు.

ఇందులో నలుగరు మహిళలు, ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ఉన్నారు.రఘునాథాలయానికి 300 మీటర్ల సమీపంలో గల మరో చిన్న దేవాలయాన్ని కూడామిలిటెంట్ల నుంచి భారత భద్రతా బలగాలుస్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ రెండు దేవాలయాలకుమిలిటెంట్ల నుంచి మరింత ప్రమాదం తప్పినట్లే.

ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మిలిటెంట్లు రఘునాథ ఆలయంలోకి చొరబడి దాడి ప్రారంభించిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మూడు గంటల పాటుమిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకమిలిటెంట్‌ మరణించాడు. రఘునాథ ఆలయం వెలుపల జరిగిన కాల్పుల్లో అర్థరాత్రి మరోమిలిటెంట్‌ హతమయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X