వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతబస్తీలో పోలీసుల గస్తీ!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: లష్కర్‌ తోయిబా తీవ్రవాదుల ఎన్‌ కౌంటర్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ పాతబస్తీలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. దక్షిణ భారతదేశంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు హైదరాబాద్‌ ను స్థావరంగా చేసుకున్నారని ఇంటెలిజిన్స్‌ నివేదికలు తెలుపుతున్నాయి.

తీవ్రవాదుల చలనం, రంజాన్‌ మాసం, రాష్ట్రపతి పర్యటన..అన్నింటిని దృష్టిలోపెట్టుకొని సోమవారం నుంచి పాతబస్తీలో బలగాల సంఖ్యనుపెంచినట్లు హైదరాబాద్‌ నగర అడిషనల్‌ కమీషనర్‌ ఎ.కె.ఖాన్‌విలేకరులకు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మప్టీలో పోలీసులను నియమించారు. లష్కర్‌ తీవ్రవాదుల కోసంపెద్ద ఎత్తున వేట ప్రారంభించారు. మతపెద్దలతో కలిసి తీవ్రవాదులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మతానికి చెడ్డపేరు తీసుకువస్తున్న ఇలాంటి కరుడుగట్టిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని ముస్లిం ప్రాంతాల్లో అవేర్‌ నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X