వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులకు కలామ్‌ పాఠాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అన్ని రంగాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌విద్యార్థులకు ఉద్బోధించారు. రాష్ట్ర పర్యటనకువిచ్చేసిన ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని భారతీయవిద్యా భవన్‌ విద్యార్థులతో ముచ్చటించారు.

విద్యార్థులు 25 వేల గంటలు పాఠశాలల్లోనే గడుపుతారని,అందువల్ల వారిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దే ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా ఉండాలని ఆయన అన్నారు.విద్యార్థుల చేతుల్లోనే భారత భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని,అందువల్ల తలిదండ్రులు, పిల్లలు ప్రతి విషయంలోనూ సృజనాత్మకతను ప్రదర్శించాలని ఆయన అన్నారు. లక్ష్యం దిశగా దృష్టి ఉండాలని, ఆ లక్ష్య సాధనకు కఠోర శ్రమ చేయాలని ఆయనవిద్యార్థులకు ఉద్బోధించారు. లక్ష్యం గురించి కలలు కనడంతో పాటు ఆ లక్ష్య సాధనకు పాటు పడాలని ఆయన అన్నారు. పాఠశాల స్థాయివిజ్ఞానాన్ని సంపాదించాలని, దాని ద్వారా కష్టపడి పని చేయాలని ఆయన అన్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌,విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని ఆయన చెప్పారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో డిజిటల్‌ కాటరాక్ట్‌ను ప్రారంభించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X