వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడిపై దాడికి అమెరికా ఖండన

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: జమ్మూలోని రఘునాథాలయంపై తీవ్రవాదుల దాడిని అమెరికా ఖండించింది. బాధితులకు తన సానుభూతిని తెలియజేసింది.

జమ్మూ కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి హింససరైన మార్గం కాదని, ఈ విషయాన్ని మిలిటెంట్లు గుర్తించాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి రిచర్డ్‌ బౌచర్‌ అన్నారు. కాశ్మీర్‌ సమస్యను శాంతియుతంగాపరిష్కరించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమెరికా సహకారంఅందిస్తుందని ఆయన చెప్పారు. ఇటీవలి విచక్షణారహితమైన హింసను తాము ఖండిస్తున్నామని, హింస కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించలేదని, ఉగ్రవాదం ఏ గ్రూప్‌ రాజకీయ లక్ష్యాలను కూడా సాధించలేదని ఆయన అన్నారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడడం ఉద్రిక్తతలను తగ్గించి, సంభాషణకు పాదులు వేయాలని ప్రయత్నిస్తున్న కొత్త రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తక్కువ చేసి చూడడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X