మానేర్ లోశవాలై తేలిన విద్యార్థులు
కరీంనగర్: విహారయాత్ర ఆవిద్యార్థుల పాలిట విషాదయాత్రగా మారింది. కరీంనగర్ పట్టణంలోనిఎస్.ఆర్.ఎమ్ కాలేజ్ కు చెందిన తొమ్మిదిమందివిద్యార్థులు తప్పిపోగా, అందులో అయిదుగురు శవాలై తేలారు.విషాదకరమైన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. అనుమానస్పదస్థితిలో తప్పిపోయినతొమ్మిది మంది విద్యార్థుల్లో అయిదుగురుబుధవారం శవాలై తేలారు. కరీంనగర్లో ఈ సంఘటన సంచలనంసృష్టించింది.
మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ లోని బాసర పుణ్యకేత్రానికి విహారనిమిత్తం రెండువావానాల్లో ఈ కాలేజ్ కు చెందిన దాదాపు ముప్ఫైమందివిద్యార్థులు కొందరు బయలుదేరి వెళ్ళారు. టాటాసుమో, మారుతి కారుల్లో కొంతమంది విద్యార్థులు బాసరకువెళ్లారు. ఆ తర్వాత వీరందరూ తిరిగి కరీంనగర్ కలిసేబయలుదేరి వచ్చారు.
మార్గమధ్యంలో జగిత్యాలవద్ద దాబా వద్ద ఈ రెండు బ్యాచ్ లు విడిపోయాయి. టాటా సుమోలోనివిద్యార్థులు ముందే కరీంనగర్ వచ్చేయగా, జగిత్యాలలోని డాబావద్ద ఆగిపోయిన మారుతీ వ్యాన్ తప్పిపోయింది.మరుసటి రోజు కూడా వీరు రాకపోవడంతో విద్యార్థులతల్లితండ్రులు పోలీసులుకు ఫిర్యాదుచేశారు.
బుధవారం మానేర్ డ్యాం వద్ద గుర్తుతెలియని శవం డ్యాం అధికారుల కంటపడడంతోవారు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు విద్యార్థులతల్లితండ్రులను పిలిపించారు. ఆ తర్వాతకొద్దిసేపటికి మరో నాలుగు శవాలు ఒడ్డుకుకొట్టుకువచ్చాయి. మొత్తం తొమ్మిదిమంది మారుతీవ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. అందులో ఏడుగురు కాలేజ్విద్యార్థులు.
మరో మాజీ విద్యార్థితో పాటు డ్రైవర్ ఆచూకీ తెలియడంలేదు. ఇందులో ముగ్గురు విద్యార్థునులు కూడాఉన్నారు. ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోన్న ఈసంఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మారూతీ కారుబయటపడితేగానీ ఏ విషయమూ చెప్పలేమని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్విలేకరులకు తెలిపారు.