మరోసారి వార్తల్లో బాబూమోహన్!
నిజమాబాద్: మంత్రిబాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచివార్తల్లోకి ఎక్కుతోన్న బాబూమోహన్ మరోసారిశ్రుతి తప్పాడు. క్యాబినెట్ సమావేశాలకుఆలస్యంగా హాజరవుతున్నందుకుముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోచీవాట్లు తిన్న బాబూమోహన్ గురువారం నిజమాబాద్లో కూడా అదేపని చేశాడు.
నిజమాబాద్ ఛాంబర్స్ ఆఫ్కామర్స్, రాష్ట్ర ఛాంబర్స్, అంతర్జాతీయ కార్మికసంఘంలు సంయుక్తంగా గురువారం నాడు నిజమాబాద్లో ఓ సదస్సును ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికిరాష్ట్ర కార్మికశాఖ మంత్రి అయిన బాబూమోహన్తో పాటు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మండవవెంకటేశ్వరరావులను ఆహ్వనించారు. ఉదయంపదకొండు గంటలకు ప్రారంభం కావాల్సిన ఈసదస్సు మంత్రులు సమయానికిరాకపోవడంతో రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.మంత్రులిద్దరూ రెండున్నర గంటలకుసభకు విచ్చేశారు. తన ఆలస్యానికి బాబూమోహన్అనారోగ్యం అని కారణం చెప్పగా, మంత్రి పార్టీపనుల వల్ల ఆలస్యమైందని చెప్పారు.