వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్తగా 40 మెడికల్ కాలేజ్ లు
హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండేళ్ళలో కొత్తగా 40 మెడికల్ కాలేజ్ లను ప్రారంభించనున్నారు. మరో ముఫ్పై డెంటల్ కాలేజ్ లకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజ్ ల యాజమాన్యాలతో ఆయన శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు.
పీజీ కోర్స్ లకు కూడా ప్రైవేట్ కాలేజ్ లకు అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. దేశంలో, విదేశాల్లో పారామెడికల్ వైద్య నిపుణులకుపెరుగుతోన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని నర్సింగ్ కాలేజ్ లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
Comments
Story first published: Friday, November 29, 2002, 23:53 [IST]