వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వల్పంగా పెట్రోధరల తగ్గింపు?
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోల్, డిజీల్ ధరలనుస్వల్పంగా తగ్గించనున్నారు. లీటర్ కు 40 పైసల వరకు తగ్గించే అవకాశం ఉంది. కేంద్రపెట్రోలియం శాఖమంత్రి రాంనాయక్ శనివారం జరపనున్న సమీక్షాసమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్ ధర తగ్గడంతోపెట్రో ధరలను తగ్గించనున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
ఇటీవలె 65 పైసల వరకు తగ్గించిన మంత్రిత్వ శాఖ మరోసారి 40పైసలు తగ్గిస్తున్నప్పటికీ..శాఖపై విమర్శలు సైతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ధరలపెరుగుదల, తరుగుదలకు రేట్ ను ముడిపెట్టిన శాఖ..పెరుగుదలలో భారీగా పెంచుతూ..తరుగుదలలో మాత్రం ఆసక్తి చూపడం లేదని నిపుణులువిమర్శిస్తున్నారు. ఈ విషయం కూడా పెట్రోలియం కంపెనీలతో మంత్రి శనివారం చర్చిస్తారని శాఖవర్గాలుపేర్కొన్నాయి.
Comments
Story first published: Friday, November 29, 2002, 23:53 [IST]