వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి పారుదలకు మరిన్ని నిధులు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: నీటి పారుదల రంగానికి మరిన్ని నిధులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏటా కరువుతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో నీటిపారుదలరంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారంశ్రీకాకుళం విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తమ ప్రభుత్వం నీటి పారుదల రంగ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాల్లోని నీటి ప్రాజెక్ట్‌ ల అభివృద్ది గురించి ఆయన కార్యకర్తలకువివరించారు. అలాగే, సభ్యత్వనమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ..పార్టీ కోసమే పనిచేసే వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించాలని ఆయన పార్టీనేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీపీ నేత కె.ఎర్రన్నాయడు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X