విజేతలకు డోప్ పరీక్ష తప్పనిసరి
విశాఖపట్నం: 32వ జాతీయక్రీడల్లోవిజేతలుగా ఆవిర్భావించిన క్రీడాకారులందరూ డోప్ పరీక్షలో తప్పనిసరిగా పాల్గొనవలిసి ఉంటుంది. డోప్ పరీక్ష శాంపుల్స్ ను న్యూఢిల్లీలో స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియాకు చెందిన ప్రయోగశాలకు ఏరోజుకారోజు పంపిస్తామని భారతీయ ఒలింపిక్ సంఘం ఉపాధ్యాక్షుడు మొహమ్మద్అస్లామ్ ఖాన్ తెలిపారు.
శనివారం ఆయన విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో పాల్గొని జాతీయక్రీడల ఏర్పాట్ల గురించివివరించారు. 48 గంటల్లో ఈ పరీక్షా ఫలితాలు తెలుస్తాయి. తుది నిర్ణయం క్రీడాసాంకేతిక కమిటీదేనని ఆయన స్పష్టం చేశారు.
స్టెరాయిడ్స్ వంటి డ్రగ్స్ వాడకం వారి ఆరోగ్యానికే ప్రమాదమే అనిఅందరి క్రీడకారులకు తెలియచేశామన్నారు. దీనిపై క్రీడాకారుల్లో అవగహన కల్గిస్తున్నామని తెలిపారు. భారతీయ ఒలింపిక్ సంఘం నిషేధ డ్రగ్స్వివరాలను ప్రచురించింది. ఈ ప్రచురణ ప్రతులను క్రీడాకారులకుఅందచేస్తున్నారు.