వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రీడాజ్యోతి వెలిగించిన సీఎం
శ్రీకాకుళం: 32వ జాతీయ క్రీడల క్రీడాజ్యోతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారంశ్రీకాకుళంలో ప్రారంభించారు. ఉదయం పట్టణం సమీపంలోనిఅరసవల్లి శ్రీసూర్య నారయణ దేవాలయంలో క్రీడాజ్యోతికి పూజలు నిర్వహించారు. అనంతరంఆ జ్యోతిని మంత్రి తమ్మినేని సీతారం శ్రీకాకుళంలోని స్టేడియానికి తీసుకువచ్చారు.
జిల్లా కలెక్టర్ కె.విజయానంద్ క్రీడాజ్యోతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకుఅందచేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రీడాజ్యోతి క్రీడాకారులువిజయనగరం, విశాఖపట్నంల మీదుగా డిసెంబర్ 12న హైదరాబాద్ కు తీసుకువస్తారు. డిసెంబర్ 13న జాతీయ క్రీడలు హైదరాబాద్ లో ప్రారంభమవుతాయి.
Comments
Story first published: Saturday, November 30, 2002, 23:53 [IST]