వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీచక కానిస్టేబుళ్ళ సస్పెన్షన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని దిల్‌ షుఖ్‌ నగర్‌ ప్రాంతంలోని ఇద్దరి మహిళలపై అత్యాచారం జరిపిన ఇద్దరు కానిస్టేబుళ్ళను శనివారం విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.వివాదస్పదంగా మారిన ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు తొలుత పోలీసులు ప్రయత్నించినా..అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. భాదితురాలు రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు కానిస్టేబుళ్ళనుఅరెస్ట్‌ చేసి, రిమాండ్‌ కు పంపించారు.

సైదాబాద్‌ పోలీసుస్టేషన్‌ కు చెందిన కానిస్టేబుళ్ళు రంగారెడ్డి, వలీ,పాషా, మరో ఇద్దరు కానిస్టేబుళ్ళు విశ్వనాథ్‌, కృష్ణంరాజులు తప్పతాగి సోమవారం రాత్రిసైదాబాద్‌ లోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. అయితే,వీరు విధులను మరిచి పట్టుబడ్డ విటులను బెదరించి డబ్బులను వసూలు చేశారు. అనంతరం వ్యభిచారులపై అత్యాచారం జరిపారు.

వార్త బయటికి పొక్కితే చంపేస్తామని కూడా బెదరించారు. అయితే, అత్యాచారానికిగురైన వారిలో ఒకరైన రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా, ఇతర రాజకీయ నాయకుల ఒత్తిడిమేరకు ఐదుగురు కానిస్టేబుళ్ళను శనివారం సాయంత్రం నాంపల్లిస్టేషన్‌ లో ప్రవేశపెట్టారు. వీరిని రిమాండ్‌ కు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X