పాక్ పై పుతిన్ నిప్పులు
మాస్కో: పాకిస్థాన్ అణ్వస్త్రాల భద్రతపై రష్యా అధ్యక్షుడువ్లాదిమర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ కు అణ్వస్త్రాలు తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉందని ఆయన భయందోళనలు వ్యక్తం చేశారు. ముషారప్ హామీ ఇచ్చినమాట వాస్తవమే. కానీ తీవ్రవాదులకు ఇవి సులువుగాఅందుబాటులోకి వచ్చే వీలుంది అక్కడ. ఇది చాలా ప్రమాదకరమైనఅంశమని పుతిన్ స్టార్ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోపేర్కొన్నారు.
మంగళవారం పుతిన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధ్యాన్యత సంతరించుకొంది. అయితే, పాకిస్థాన్ తప్పులన్నింటిని ఆ దేశ అధ్యక్షుడు ముషారప్పైకి నెట్టడం సబబు కాదని పుతిన్ అన్నారు.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు(పాక్, భారత్)సైన్యాలను ఉపసంహరించుకున్నాయి. ఇది చాలా మంచి చర్య. అయితే, ముషారప్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నాని ఆయనపేర్కొన్నారు.
ఆ హామీని నిలబెట్టుకునేలా ఒత్తిడి మాత్రమే మనం తీసుకురావాలి తప్ప, అన్ని తప్పులను ఆయనపై రుద్దడం సబబుకాదని ఆయన అన్నారు. భారత్ తో రష్యా గాఢానుబంధం ఏ దేశానికి ముప్పు కాదని పుతిన్ స్పష్టం చేశారు.