రంగారెడ్డి జిల్లాలో నక్సల్స్ విధ్వంసం
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిసీబీఐకి సోమవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి సుప్రీం తీర్పు అయితే, మరోకటి మలేషియా కోర్టు తీర్పు. బోఫోర్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూజా సోదరులపై జరుగుతోన్నవిచారణపై సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది. నాలుగు వారాల పాటువిచారణను వాయిదావేసింది. స్టే విధించాలని హిందూజా సోదరులు దఖలు చేసినఅప్లికేషన్ కు సుప్రీం సానుకూలంగా స్పందిస్తూ..సిబీఐ దీనిపై సమాధానం ఇచ్చేంతవరకువిచారణను వాయిదావేయాలని తీర్పునిచ్చింది.
మరోవైపు, మలేషియా కోర్టు ఖత్రోచి అప్పగింతపై సోమవారం కీలకమైన తీర్పును వెలువర్చింది. బోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు అట్టావో ఖత్రోచినిఅప్పగించాలన్న భారత ప్రభుత్వం విజ్ఞాపనఅసంబద్దంగా ఉందని మలేషియా సెషన్స్ కోర్టుపేర్కొంది.
ఖత్రోచి నేరాలకు పాల్పడినట్లు భారత ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో ఎక్కడా లేదనిపేర్కొంటూ కేసును కొట్టిపారేసింది. అయితే, దీనిపై మలేషియా హైకోర్టుకు వెళుతామనిసీబీఐ ప్రకటించింది.