వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్బజన్‌, సెహవాగ్‌లకు జరిమానా

By Staff
|
Google Oneindia TeluguNews

అక్లాండ్‌: న్యూజిలాండ్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇద్దరు భారత క్రికెట్‌ క్రీడాకారులకు జరిమానా వేసింది. డర్టీ ష్యూస్‌తో అడుగుపెట్టినందుకు గాను సోమవారం ఈ జరిమానా విధించింది.

హాఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌, బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహవాగ్‌లకు న్యూజిలాండ్‌ మంత్రిత్వ శాఖ జరిమానా వేసినవిషయాన్ని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ధృవీకరించింది. న్యూజిలాండ్‌ వ్యవసాయోత్పత్తుల ఎగుమతిలోపేరెన్నిక గన్నది. ఐరోపాలో ఫుట్‌, మౌత్‌, మ్యాడ్‌ కవ్‌ వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో జీవ భద్రత పట్ల న్యూజిలాండ్‌ అత్యంత జాగరూకత వహిస్తోంది. ఈ పరిస్థితిలో అపరిశుభ్రమైన బూట్లతో న్యూజిలాండ్‌లో కాలుపెట్టిన హర్బజన్‌, సెహవాగ్‌లకు జరిమానా పడింది.

దేశంలోకి వచ్చే విమానాల్లో అగ్రికల్చర్‌ వీడియోను ప్రదర్శిస్తారు. హెచ్చరికలు చేస్తారు. లాంజ్‌లో లౌడ్‌స్పీకర్లు ఆ హెచ్చరికలను పదే పదే వల్లిస్తుంటాయి. కుక్కలు వాసన చూసి అభద్రతా పదార్థాలను పసిగడతాయి. ఇంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రయాణికులు దొరికిపోవడం ఇక్కడ మామూలయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X