వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసపట్టులో కివీస్‌, భారత్‌ల మ్యాచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హామిల్టన్‌: న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో క్రికెట్‌ టెస్టు రసపట్టులో పడింది. ఇరు జట్లు తొలిసారి తమ తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగులను దాట లేకపోయాయి. మ్యాచ్‌ను గెలవడానికి న్యూజిలాండ్‌ ముందు భారత్‌ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఆటలో 22వికెట్లు పడిపోవడం విశేషం. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లోవికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. మ్యాచ్‌ను గెలవడానికి న్యూజిలాండ్‌ ఇంకా 136 పరుగులు చేయాల్సి ఉన్నది. ఈ మ్యాచ్‌ గెలిస్తే న్యూజిలాండ్‌ రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసినట్టవుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదివికెట్లు నష్టపోయి 92 పరుగులు చేసిన భారత్‌ మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు కూడా ఇండియాకు పట్టిన గతే పట్టింది. భారత బౌలర్లు తమ అద్భుతమైన ప్రతిభను కనబరిచి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలుపెట్టారు. జహీర్‌ఖాన్‌ ఐదు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్‌ 94 పరుగులకు అలవుట్‌అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ ఆలవుట్‌అయింది. న్యూజిలాండ్‌ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X